శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 25 మే 2015 (17:43 IST)

చీరాల వాడరేవు చూసేందుకు వచ్చి వడదెబ్బకు చనిపోయిన విదేశీయుడు

సూర్యుడి ప్రతాపం పెరుగుతోంది. విదేశాల నుంచి మన రాష్ట్రాల్లో పర్యటించేందుకు వచ్చే పర్యాటకులు భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల లోని వాడరేవు ( బీచ్)ను సందర్శించేందుకు అర్జెంటీనా దేశం నుంచి వచ్చిన 64 ఏళ్ల పర్యాటకుడు వడదెబ్బ కారణంగా మరణించారు. ఆయన వీసాపై భారతదేశానికి వచ్చారు. 
 
ఏప్రిల్ నెల 29న చీరాల వచ్చిన ఆయన వాడరేవులోని అతిథి గృహంలో బస చేస్తున్నారు. అక్కడే ఉంటూ స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను పరిశీలిస్తూ వుండగా ఆయన వడదెబ్బకు గురయ్యారు. ఆదివారంనాడు ఆయన నిర్జీవంగా కనిపించారు.