బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (05:59 IST)

భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ధర్నా.. కలెక్టరేట్ ముట్టడి

విజయనగరం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కోసం జరుగుతున్న భూసేకరణను వ్యతిరేకిస్తూ సోమవారం వేలాది మంది రైతులు నిరసన తెలిపారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. భూసేకరణ వలన తాము తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోందని వాపోయారు. వివరాలిలా ఉన్నాయి. 
 
భోగాపురంలో నిర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద  సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొన్న  ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే  ఆర్.వి. సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడారు.  
 
అనంతరం   ర్యాలీగా కలెక్టరేట్ వరకూ వెళ్లారు.  కొందరు నాయకులు   కలెక్టరేట్‌లోకి వెళ్లి జాయింట్ కలెక్టర్ బి రామారావుకు వినతిపత్రాన్ని సమర్పించారు.