శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:25 IST)

నెల్లూరు జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్.. ఆ పై హత్య..!

సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో నెల్లూరు జిల్లా, కావలిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత అత్యంత దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. 
 
పోలీసుల వివరాల మేరకు.. కావలి శివారు ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని, గుర్తు తెలియని దుండగులు బలవంతంగా పొదలమాటుకు ఎత్తుకెళ్లి... పాప నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం జరిపారు. ఆ తరువాత పక్కనే ఉన్న బండరాళ్లలో చిన్నారిని చితగొట్టి చంపేసి, పరారైయ్యారు.
 
ఇంటి బయట ఆడుకుంటున్న పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాలిస్తుండగా, పొదల్లో చిన్నారి శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని హంతకుల కోసం గాలిస్తున్నారు.