శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 జూన్ 2016 (10:10 IST)

సీఎం చంద్రబాబు దత్తత గ్రామానికి నిధుల వరద... రూ.1.90 కోట్లు విడుదల

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత గ్రామానికి నిధుల వరద పారుతోంది. ఈ గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా రూ.1.90 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత గ్రామానికి నిధుల వరద పారుతోంది. ఈ గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా రూ.1.90 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది.
 
స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ జిల్లాలోని అరకు మండలం పెదబయలు పంచాయతీని దత్తత తీసుకున్న విషయంతెలిసిందే. ఈ గ్రామంలో అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి. ఈ శనివారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ రూ.1.90 కోట్లను విడుదల చేసింది.
 
ఈ నిధుల్లో పెదబయలులో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.25 లక్షలు, పంచాయతీ పరిధిలోని అరకు వ్యాలీలో మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరో రూ.25 లక్షలు, అరకులో ఎడ్యుకేషన్ హబ్ కోసం రూ.1.40 కోట్లు కేటాయించనున్నారు. నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీచేయడంతో త్వరలోనే అక్కడ పనులు ఊపందుకోనున్నాయి.