శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: శనివారం, 31 జనవరి 2015 (06:05 IST)

వెంకన్న దర్శనానికి వచ్చిన గాలి జనార్థన్ రెడ్డి

ప్రముఖ పారిశ్రామికవేత్త, గనుల కుంభకోణంలో ముద్దాయి అయిన గాలి జనార్దన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు. బెయిల్‌పై ఇటీవల విడుదలైన జనార్థన రెడ్డికి చివరి కేసులో విముక్తి లభించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి దర్శనార్థం కుటుంబంతో కలసి వచ్చారు. కుటుంబ సభ్యులు నేరుగా తిరుమలకు చేరకున్నారు. 
 
ఆయన మాత్రం అలిపిరి మార్గం నుంచి కాలి నడకన రాత్రి పది గంటలకు తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.