గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (13:17 IST)

కేసీఆర్ తప్పుకో...! నీవు చేసింది.. రాజకీయ వ్యభిచారం.. గాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యభిచారం చేశారని, ఫోన్ ట్యాపింగ్ అదే కోవకు చెందుతుందని తెలగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు ఆరోపించారు. కేసీఆర్ పదవీచ్యుతుడు కాకమునుపే మర్యాదగా తప్పుకోవడం ఉత్తమమని ఆయన సలహా ఇచ్చారు. 
 
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మట్లాడారు. ముందు అంతా తాము ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదని బుకాయించారని చెప్పారు. అయితే కోర్టు ఎదుట అసలు విషయం ఒప్పుకోక తప్పలేదని చెప్పారు. ఇతరుల ఫోన్‌కాల్ సంభాషణ వినడమంటే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని చెప్పారు. ఇది ఓటుకు నోటు కంటే నీచమైన పని అన్నారు. 
 
అలా ఇతర ప్రభుత్వాల ఫోన్లను ట్యాపింగ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని ఆయన చెప్పారు. కాబట్టి కేసీఆర్ మర్యాదగా తప్పుకోవడం మంచిదని అన్నారు.