బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (21:02 IST)

వృద్ధాశ్రమంలో బాలికపై అత్యాచారం... సహోద్యోగులే కామాంధులు...

రంగారెడ్డి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ వచ్చిన ఒక దళిత బాలిక (12)పై ఆశ్రమంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రేప్ గత యేడాది కాలంగా చేస్తూ వచ్చారు. తాజాగా బాధితురాలి ఫి

రంగారెడ్డి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ వచ్చిన ఒక దళిత బాలిక (12)పై ఆశ్రమంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రేప్ గత యేడాది కాలంగా చేస్తూ వచ్చారు. తాజాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసుల కథనం మేరకు... రాజమండ్రికి చెందిన 12 యేళ్ళ బాలిక హైదరాబాద్‌కు సమీపంలోని నాగోల్‌లో ఉన్న అక్షయ్ వృద్ధాశ్రమంలో నెలకు రూ.3 వేల వేతనానికి పనిలో చేరింది. అక్కడ పని చేసే ముగ్గురు వ్యక్తులు ఈ బాలికపై కన్నేశారు. ఆ తర్వాత ఆ బాలికను బెదిరించి ముగ్గురు నిర్వాహకులు ఒక యేడాది కాలంగా వేర్వేరుగా తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ కామాంధుల వేధింపులను భరించలేని ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎల్.బి. నగర్ పోలీసులు శ్రీనివాస రెడ్డి, మాణిక్య రావు, వేణుగోపాల్‌ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గతంలో పలుమార్లు అత్యాచారం చేసినా ఆ యువతి ఫిర్యాదు చేయలేదని ఎల్బీ నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి.సుదర్శన్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.