శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (20:23 IST)

హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ : కృష్ణాలో భర్త మర్మాంగం కోసిన భార్య!

రాజధాని నగరం హైదరాబాదుతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఓ మహిళ హత్యకు గురికాగా, కృష్ణా జిల్లా నందిగామ మండలంలో ఓ వివాహిత తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, ఆ తర్వాత లవర్‌తో కలిసి పారిపోయింది. ఈ రెండు సంఘటనలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. వీటిని పరిశీలిస్తే... 
 
కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన మర్లపూడి ఆశీర్వాదం (30)కు చందర్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన ప్రమీలతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మహేశ్వరి, సిరివల్లి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆశీర్వాదం తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రమీల వేల్పుల వినోద్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
అయితే, వీరి రహస్య శృంగారానికి భర్త అడ్డొచ్చాడు. దీంతో అతని పీడ వదిలించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్రమీల ప్లాన్ వేసింది. ఆ ప్లాన్‌లో భాగంగా సోమవారం అర్థరాత్రి నిద్రిస్తున్న భర్త ఆశీర్వాదం మర్మాంగాలు కోసి హత్య చేశారు. ఆ తర్వాత ఇరువురూ ఊరు వదిలి పారిపోయారు. ఈ హత్య విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అలాగే, రాజధాని నగరం హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సామూహిక అత్యాచారం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి ఘట్కేసర్ వెళ్తున్న ఓ మహిళను ఆటో డ్రైవర్‌తో సహా మరో నలుగురు బలవంతంగా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న కామాంధుల కోసం గాలిస్తున్నారు.