బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (10:13 IST)

తిరుపతి విద్యార్థినులపై వరంగల్‌లో అత్యాచారం... ఆలస్యంగా వెలుగులోకి...

తిరుపతిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు వరంగల్ జిల్లాలో అత్యాచారానికి గురయ్యారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... చిత్తూరు జిల్లా ఏర్పేడు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఉన్న ఎస్సీ హాస్టలులో ఉంటూ ప్రభుత్వం పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ఈనెల 24వ తేదీన ఊరి నుంచి హాస్టల్‌కు వచ్చారు. మరుసటి రోజు ఉదయం పాఠశాలకు వెళ్లిన వారిద్దరు తిరిగి హాస్టల్‌కు రాలేదు. దీంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అయితే, తిరుపతిలో అదృశ్యమైన ఆ ఇద్దరు బాలికలు అదేరోజు రాత్రి వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. రాత్రి 9.30 గంటల సమయంలో స్టేషన్‌లో దిక్కులు చూస్తూ ఉండటాన్ని రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫాంపై చిల్లర సరుకులు అమ్ముకునే విశ్వనాథ్, సతీష్ అనే ఇద్దరు యువకులు గుర్తించి, వారి దగ్గరు వెళ్లి ఆరా తీశారు. తాము తిరుపతి నుంచి వస్తున్నామనీ, అనుకోకుండా ఈ స్టేషన్‌లో దిగినట్టు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ ఇద్దరు యువకులు.. ఆ ఇద్దరు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తమ గదికి తీసుకెళ్లారు. పైగా తామిద్దరు ఈ స్టేషన్‌లోనే పని చేస్తున్నట్టు గుర్తింపు కార్డులు కూడా చూపించారు. దీంతో ఆ ఇద్దరు బాలికలు వారి వెంట నడిచారు. 
 
ఆ తర్వాత వారికి భోజనం పెట్టి.. నిద్రకు ఉపక్రమించగానే వారిపై అత్యాచారనికి పాల్పడ్డారు. వీరితోపాటు వీరి స్నేహితులు నజీర్, రాజేశ్‌లకు కూడా సమాచారం చేరవేయడంతో వారు కూడా వచ్చి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెపితే చంపేస్తామని బెదిరించారు. అయితే, ఇద్దరు బాలికల్లో ఒకరు కామాంధుల చెర నుంచి తప్పించుకుని వచ్చి.. విజయవాడకు చేరుకుని అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... ఆ బాలికను వెంటబెట్టుకుని వరంగల్‌కు వెళ్లి విశ్వనాథన్‌ను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పరారీలో ఉన్నారు. మరో బాలికతో పాటు మిగిలిన ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.