శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2016 (10:14 IST)

గ్యాంగ్‌స్టర్ నయీం అకృత్యాలు : మాట వినలేదని నిద్రమాత్రలు వేసి మైనర్‌ బాలిక హత్య

గ్యాంగ్‌స్టర్ నయీం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మైనర్ బాలిక మాట వినలేదనీ నిద్రమాతలు వేసి హత్య చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న

గ్యాంగ్‌స్టర్ నయీం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మైనర్ బాలిక మాట వినలేదనీ నిద్రమాతలు వేసి హత్య చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న నస్రీన్ (17)కు నిద్రమాత్రలు వేసి చంపేశాడు. ఒకరోజు బంధువు అలీముద్దీన్ కూతురు అహెలా పెళ్లిచూపుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు నయీం, ఇంట్లోని వారు సిద్ధమయ్యారు. ఆసమయంలో అల్కాపురిలోని ఇంట్లో ఉండేందుకు నస్రీన్ నిరాకరించింది. ఇదేవిషయమై చిన్నపాటి గొడవ జరగడంతో ఇంటిపై నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది.
 
నయీం నస్రీన్‌ను గదిలోకి తీసుకొచ్చి.. తీవ్రంగా కొట్టి.. నిద్రమాత్రలు మింగించాడని, తర్వాత అందరం కలిసి పెళ్లిచూపులకు వెళ్లినట్లు ఫయీం పోలీసులకు వెల్లడించాడు. ఫంక్షన్‌ నుంచి అర్థరాత్రి తిరిగొచ్చామని, నస్రీన్ చనిపోయినట్లు గుర్తించి నయీం, తాను, ఇతరులు కలిసి మృతదేహాన్ని రాత్రికిరాత్రి అల్కాపురికి సమీపంలోని మంచిరేవుల ప్రాంతంలో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఫయీం ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం మంచిరేవుల ప్రాంతంలో రాజేంద్రనగర్‌ తహశీల్దార్‌, వైద్య బృందం సమక్షంలో తవ్వకాలు జరిపిన పోలీసులు.. ఓ అస్థిపంజరాన్ని బయటకు తీశారు. అది నస్రీన్‌దో కాదో తేల్చేందుకు డీఎనఏ పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. 
 
మరోవైపు... గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసుల్లో వాస్తవాలతోపాటు అతడు క్రూరంగా హత్యచేసినవారి అస్థిపంజరాలను పోలీసులు వెలికి తీస్తున్నారు. నయీం వ్యవహారంలో తెలంగాణవ్యాప్తంగా 34 కేసులు నమోదు చేసిన పోలీసులు.. నయీం కుటుంబ సభ్యులతోపాటు గ్యాంగ్‌కు చెందిన మొత్తం 38 మందిని అరెస్టు చేశారు. ఫర్హానా, అఫ్షా, ఫయీం, షహీన్‌ను కస్టడీకి తీసుకుని విచారించి... అల్కాపురిలో హత్యకు గురైనవారు, ఆచూకీ లేకుండా పోయిన వారి వివరాలు రాబడుతున్నారు.