తొమ్మిదేళ్ల చిన్నారిపై యేడాదిగా అత్యాచారం.. నెల్లూరులో దారుణం
జిల్లా కేంద్రమైన నెల్లూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి మానవత్వాన్ని మరిచి మృగమయ్యాడు. రాక్షస అకృత్యాలకు పాల్పడ్డాడు. ముక్కు పచ్చలారని తొమ్మిదేళ్ల చిన్నారిపై ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ అఘ
జిల్లా కేంద్రమైన నెల్లూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి మానవత్వాన్ని మరిచి మృగమయ్యాడు. రాక్షస అకృత్యాలకు పాల్పడ్డాడు. ముక్కు పచ్చలారని తొమ్మిదేళ్ల చిన్నారిపై ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఆ కసాయి. మానవత్వం మంటగలిసే ఈ సంఘటనపై శనివారం రాత్రి నెల్లూరు గ్రామీణ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
ఈ వివరాలను పరిశీలిస్తే... సైదాపురం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. భర్త చనిపోవడంతో ఆమె తన ముగ్గురు పిల్లలతో నెల్లూరుకు వచ్చింది. ఈ క్రమంలో భార్యాబిడ్డలను వదిలేసి వచ్చిన పెంచలయ్య అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఐదేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ఆమె పాచిపనికి వెళుతుండగా పెంచలయ్య డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ మహిళ కుమార్తెను కూడా మాయమాటలతో లొంగదీసుకున్న తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి... యేడాది నుంచి అత్యాచారం జరుపుతున్నాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో టీవీలో నీలిచిత్రాలను చూపిస్తూ లైగింక దాడులకు తెగబడ్డాడు. శుక్రవారం ఆ చిన్నారి తాను చదువుతున్న పాఠశాలలో తోటి స్నేహితురాలికి ఈ విషయాన్ని చెప్పింది. ఆ విద్యార్థిని ఉపాధ్యాయులకు చెప్పగా వారు శనివారం ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఇందుకూరుపేట సీడీపీవో శారదాకుమారి, సూపర్వైజర్ లక్ష్మీప్రసన్న, ఐసీపీఎస్ సురేష్ ఆ చిన్నారితో పాటు తల్లిని వెంటబెట్టుకుని నెల్లూరు గ్రామీణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.