గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 11 నవంబరు 2014 (19:01 IST)

కదిరిలో బాలికపై ఎంఐఎం లీడర్ అత్యాచారం... నిర్భయ చట్టం అప్లై

అనంతపురంలో ఓ బాలికను బెదిరించి గత మూడు నెలలుగా రేప్ చేస్తున్న ఘటన పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ ప్రతినిధుల చెప్పిన వివరాల ద్వారా వెల్లడయింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. కదిరి పట్టణ శివారు బాలప్పగారిపల్లిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మైనారిటీ వర్గానికి చెందిన 14 ఏళ్ల బాలిక పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఐతే ఆమె పట్ల ఓ బాలుడు అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో అతడి నుంచి తనను రక్షించాలని చెప్పేందుకు ఎంఐఎం పార్టీ నాయకుడు ఇలియాజ్ అనే వ్యక్తి దగ్గరకి వెళ్లింది. ఐతే ఆదుకోవాల్సిన అతను కామ పిశాచిగా మారాడు.
 
మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి, గర్భం వచ్చేందుకు కారణమయ్యాడు. దాంతో ఇలియాస్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. నిందితుడిపై 376, 506, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, ప్రస్తుతం పరారీలో ఉన్న ఇలియాజ్ కోసం గాలిస్తున్నారు. 
 
కాగా ఇతడు ఆ బాలికపై నాలుగు నెలలుగా అత్యాచారం జరపటమే కాకుండా చిత్రహింసలు పెట్టాడు. ఈ కీచకపర్వాన్ని తన సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. విషయం బయటకు పొక్కితే కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ ఆ బాలికను బెదిరించాడు. 
 
ఈ విషయం బాలిక తల్లికి చేరడంతో ఆమె ఇలియాజ్తో  గొడవకు దిగింది. అయితే ఆమెను సైతం అతడు బెదిరించటంతో ఆ కుటుంబం భయాందోళనలకు గురైంది. విషయం తెలుసుకున్న పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సభ్యులు బాధిత విద్యార్థి, తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో వారంతా కలిసి జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, కదిరి డీఎస్పీ దేవదానంకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఇలియాజ్‌ కోసం గాలిస్తున్నారు.