శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 జనవరి 2017 (14:35 IST)

ఫేస్‌బుక్ పరిచయం.. ఆరేళ్ళ చిన్నోడితో పెళ్లి... గర్భందాల్చిన మహిళ.. తర్వాత ఏమైంది?

ఫేస్‌బుక్ పరిచయం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో మరో సంఘటన ద్వారా నిరూపితమైంది. ఈ పరిచయంతో తనకంటే వయసులో తనకంటే ఆరేళ్లు తక్కువగా ఉన్న మైనర్‌ యువకుడిని పెళ్లాడిన ఓ మహిళ గర్భందాల్చింది.

ఫేస్‌బుక్ పరిచయం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో మరో సంఘటన ద్వారా నిరూపితమైంది. ఈ పరిచయంతో తనకంటే వయసులో తనకంటే ఆరేళ్లు తక్కువగా ఉన్న మైనర్‌ యువకుడిని పెళ్లాడిన ఓ మహిళ గర్భందాల్చింది. ఇపుడు తాను చేసిన తప్పు తెలుసుకున్న మైనర్ యువకుడు తన తల్లిదండ్రుల చెంతకు వెళ్లడంతో ఆ మహిళ ఏం చేయాలో దిక్కుతోచక.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతపురం జిల్లా గుంతకల్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంతకల్‌ పట్టణానికి చెందిన రాజేశ్వరి (27) అనే మహిళ అప్పటికే వివాహమై విడాకులు తీసుకుంది. అయితే, ఫేస్‌బుక్ ద్వారా తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన కర్నూలు యువకుడు సాయి ఈశ్వర్‌ ఫోటోను చూసి ఇష్టపడింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పైగా, ప్రేమకు వయసు అడ్డుకాదని ఈశ్వర్ భావించి ఆ మహిళను వివాహం చేసుకున్నాడు. పిమ్మట ఇద్దరూ కలిసి హైదరాబాద్‌కు వెళ్లి కాపురం పెట్టారు. భార్యాభర్తలిద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగానికి చేరారు. ఈ క్రమంలో రాజేశ్వరి గర్భం దాల్చింది. 
 
ఇదిలావుండగా, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న తమ కుమారుడిని చూసేందుకు ఈశ్వర్ తల్లిదండ్రులు సిటీకి వెళ్లారు. అక్కడికి వెళ్లాక వారికి అసలు నిజం తెలిసింది. తమ బిడ్డ ఇంకా మైనరేనని, 21 సంవత్సరాలు దాటలేదని చెబుతూ అతన్ని సొంతూరు కర్నూలుకు తీసుకొచ్చేశారు. రాజేశ్వరి మాత్రం తన భర్త కోసం కర్నూలుకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఊహించని షాక్ తగిలింది. 
 
తాను తల్లిదండ్రులతోనే ఉంటానని, తాను తల్లిదండ్రులకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశానని ఈశ్వర్ చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక.. అతని ముందే బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రాణాపాయం నుంచి బయటపడింది. తన భర్తను తన వెంట పంపాలని ఆమె ప్రాధేయపడుతోంది. అయితే పోలీసులు ఏం చేయాలో తోచక మల్లగుల్లాలు పడుతున్నారు.