శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 మే 2014 (16:11 IST)

మోడీని నమ్మడంతోనే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు: హరిబాబు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నమ్మబట్టే పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబు అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే పవన్, టీడీపీ బీజేపీకి మద్దతు పలికాయని హరిబాబు వ్యాఖ్యానించారు. 
 
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ-తెనాలి-గుంటూరు నగరాలకు కలుపుతూ మెట్రో రైలును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా మెట్రో రైలు అంశంపై ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. 
 
యుపిఏ ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ హామీ ఇచ్చిందని హరిబాబు గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు గత ఏడెనిమిదేళ్లుగా ముందుకు సాగలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రాంతాలు లబ్ధి పొందుతాయని హరిబాబు అన్నారు.