శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 28 మే 2015 (10:28 IST)

ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలి... హరికృష్ణ

తెలుగుజాతి కీర్తిని, శక్తిని విశ్వవ్యాప్తం చేసిన వారిలో దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ ఒకరని ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఆయన కుమారుడు మాజీ ఎంపి హరికృష్ణ డిమాండ్ చేశారు. భారత రాజకీయాలలో పెనుమార్పులకు నాంది పలికిన వ్యక్తని కొనియాడారు. ఆయన 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన కుటుంబం నివాళులర్పించింది. 
 
తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాప్తి చేసింది ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు, నటుడు హరికృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగువారందరి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా కలిసిమెలిసి ఉండాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని, కలిసికట్టుగా లక్ష్యాలను సాధించుకోవాలని హరికృష్ణ పేర్కొన్నారు. 
 
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పురందేశ్వరీ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. వీరితో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.