శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (19:43 IST)

పెదాలపై నవ్వు, కడుపులో విషం.. చంద్రబాబు నైజమిదేనన్న హరీష్ రావు

పెదాలపై నవ్వు, కడుపులో విషం.. ఇదే ఏపీ సీఎం చంద్రబాబు నైజమని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. వెన్నుపోట్లు, మోసం తదితర అంశాల్లో బాబుకు డాక్టరేట్ ఉందని హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ విషయంలో గవర్నర్ వద్దకు వెళ్ళిన కాంగ్రెస్ నేతలను విమర్శించేందుకు టీడీపీ నేతలకు మాటలు రావడంలేదని అన్నారు. 
 
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణ రాష్ట్రానికే ఉందని హరీశ్ రావు ఉద్ఘాటించారు. కృష్ణా రివర్ బోర్డు సందేహాలకు తాము జవాబిచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలకు కారణమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ అధిక టీఎంసీల నీరు వాడుకుందని హరీష్  రావు ఫైర్ అయ్యారు.