శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (10:38 IST)

సెక్స్ చేస్తుంటే చూశాడని... విద్యార్థిని కొట్టి చంపిన టీచర్ : కావలిలో దారుణం...

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే శ్రీ విద్యానికేతన్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా అయ్యన్న పని చేస్తున్నారు. ఇదే పాఠశాలలో పని చేస్తున్న కౌసల్య అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరు పాఠశాలలోనే శృంగారంలో పాల్గొనివుండగా, సాయికృష్ణ అనే విద్యార్థి కళ్ళారా చూశాడు. దీంతో కౌసల్యకు భయం పట్టుకుంది. 
 
ఈ విషయం బయట చెప్పకుండా ఉండేలా భయపెట్టాలని అయ్యన్నకు కౌసల్య సూచించింది. దీంతో హాస్టల్‌లో ఉండే సాయికృష్ణను అయ్యన్న తన గదిగి పిలిపించి భయపెట్టేందుకు చెంపపై కొట్టాడు. చెంప దెబ్బ బలంగా తగలడంతో సాయికృష్ణ తూలి పక్కనే ఉన్న గ్రానైట్ స్లాబుపై పడ్డాడు. దీంతో తలకు బలమైనగాయమై అక్కడే ప్రాణాలు విడిచాడు. 
 
దీంతో భయపడ్డ అయ్యన్న అనారోగ్యంతో సాయికృష్ణ మృతిచెందాడంటూ ఆసుపత్రికి తరలించి డ్రామాకు తెరతీశాడు. అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు అన్ని విషయాలు వెలుగులోకి తేవడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.