శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (10:10 IST)

వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న జనం.. ఒకే రోజు 86 మంది మృతి

ఎండలు అలాగే కొనసాగుతున్నాయి. 45 డిగ్రీలకు దిగిరామని అంటున్నాయి. 47 డిగ్రీలకు కూడా చేరుకున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. జిల్లాలు నిప్పుల కుంపటుల్లా మారిపోయాయి. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 86మంది మృతి చెందారు.
 
శ్రీకాకుళం జిల్లాలో 7గురు మృతిచెందగా, విజయనగరంలో 5 గురు, విశాఖ 3, కృష్ణా 17, గుంటూరు 10, ప్రకాశం 22, నెల్లూరు 9, తూర్పుగోదావరి 2, పశ్చిమగోదావరి 1, కర్నూలు 3, అనంతపురం 1, చిత్తూరు 1, కడపలో ఒకరు మృత్యువాత పడ్డారు.