గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr

ఒకే ఒక్క రోజు... 222 మంది మృతి.. ప్రచండ భానుడు

ఎక్కడ చూసినా ఎండ ఎండ.. ఈ సమ్మర్ చివర్లో ఇదే చర్చ. వేసవి మధ్యలో కాస్తంతగా వర్షాలు పడడంతో ఊరట చెందిన జనం మే చివర్లో ప్రచండ భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్నారు. ఒకే ఒక్క రోజులో 222 మంది పిట్టల్లా రాలిపోయారు. ఎంతగా ఉన్నాయంటే ఉష్టోగ్రతలు ఎన్నడూ లేని విధంగా 47కు చేరుకున్నాయి. 
 
మే నెలలో సాధారణంగా వేడి ఎక్కువ. ఇది మామూలే. గురువారం మరీ ఎక్కువగా కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భానుడు తన ప్రతాపాన్ని జనంపై చూపారు. అత్యధికంగా సూర్యాపేటలో 47.5 డిగ్రీల ఉష్టోగ్రత నమోదయ్యింది. ఇక రామగుండంలో 46.8, నిజామాబాద్ లో 46.6, హైదరాబాద్ లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
ఆంధ్రప్రదేశ్ ఏమైనా చల్లగా ఉందా అంటే అలాంటి పరిస్థితులు ఏమి కనిపించడం లేదు. రెంట చింతలో 47 డిగ్రీలు, గుంటూరులో 45.8, తిరుపతి 45 డిగ్రీలు నమోదయ్యాయి. వీటికి వడగాల్పులు తోడవడంతో తెలంగాణలో 147 మంది చనిపోయారు. కరీంనగర్, నల్గొండ జిల్లాలలో 31 మంది చొప్పున, ఖమ్మం జిల్లాలో 27, వరంగల్ లో 23 చనిపోగా, ఏపీలో 78 మృత్యువాత పడ్డారు. మరో రెండు రోజుల పాటు ఈ ఎండలు ఇలాగే ఉండవచ్చునని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.