బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 11 మార్చి 2015 (18:24 IST)

హీరో శివాజీ శివాజీయే... అవయవదానం చేసిన మణికంఠ కుటుంబానికి ఆర్థిక సాయం

హీరో, రాజకీయ నాయకుడు శివాజీ సినిమాల్లోనే కాదు... నిజ జీవితంలోనూ హీరోయే. విషయంలోకి వెళితే... ఇటీవల రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన మణికంఠ బ్రెయిన్ డెడ్ అవడం, అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడం రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. తమ కుటుంబ సభ్యుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయినా అతడి అవయవాలను మరొకరికి దానం చేయడం ద్వారా ఇంకొందరి జీవితాల్లో వెలుగులు నింపారు. 
 
వారిని పరామర్శించేందుకు భాజపా నాయకుడు, సినీ హీరో శివాజీ వెళ్లారు. వారిని ఓదార్చి, వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఆర్థిక సాయం ప్రతి ఏటా తాను చేస్తానని వారికి మాట ఇచ్చారు. మణికంఠ తల్లిని తన సొంత తల్లిలా చూసుకుంటానని, వారి బాగోగులు చూస్తానని శివాజీ చెప్పారు. అవయవదానం చేసిన మణికంఠ కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శివాజీ పిలుపునిచ్చారు.