శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (18:04 IST)

రాజమండ్రి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి... శివాజీ ఆగ్రహం...!

రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ వద్ద స్కూలు బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటనపై బీజేపీ పార్టీ నేత, ప్రముఖ సినీ నటుడు శివాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్ నెస్‌లేని బస్సుకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాజకీయనేతలు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయ నాయకులు మనకు ఇప్పటి వరకు ఏం సాధించి పెట్టారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. 
 
ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు పోతారోనంటూ వ్యాఖ్యానించారు. ప్రతివాడూ ఉపన్యాసాలు ఇస్తారని మండిపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం దారుణమని అన్నారు. ఈ ఘటనకు అక్కడి పోలీసులు బాధ్యత వహించాలన్నారు. అంతేకాకుండా ఈ బస్సులో జనాన్ని దీక్షకు తరలిస్తున్నందున వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రోడ్డి, పోలీసు వ్యవస్థ అబాధ్యత వలన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాదానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎవరి బాధ్యతలు వాళ్లు కచ్చితంగా నిర్వర్తిస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవని శివాజీ తెలిపారు.