శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (14:04 IST)

టీ ఆలస్యంగా తెచ్చిందని భార్యను కత్తితో పొడిచిన భర్త!

టీ ఆలస్యంగా ఇచ్చిన పాపానికి కత్తితో భార్యను హత్యచేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ధెంకనల్ జిల్లా గుహాలివల్ గ్రామంలో మహాలియా నాయక్ అనే 56 ఏళ్ల వ్యక్తి ఉన్నాయుడు. అతను తన భార్య ఝానాను టీ తీసుకురమ్మని అడిగాడు. అయితే, టీ ఆలస్యంగా తెచ్చినందుకు ఆమె పైన కేకలు వేశాడు. 
 
అంతేకాదు ఆమెతో గొడవకు దిగాడు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం పెరిగింది. గొడవ తీవ్రస్థాయికి పెరిగింది. దీంతో ఇంట్లో వంట చేసేందుకు భార్య అంగీకరించలేదు. మరింత కోపోద్రిక్తుడైన భర్త నాయక్ భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.