గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2014 (14:18 IST)

భార్యను చంపిన భర్త... ప్రియుడితో రాత్రివేళ చూసి...

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో బొండా అప్పారావు కట్టుకున్న భార్యను నరికి చంపాడు. ఆదివారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన అప్పారావు తన ఇంట్లో తన భార్య మరొకడితో పడుకుని ఉండటాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు.వేరే వ్యక్తితో పడకపై కలిసి ఉండటం చూసిన భర్త ఆగ్రహం పట్టలేక భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉంటున్న బొండా అప్పారావు... తన భార్యతో పడకపై అదే గ్రామానికి చెందిన సూరిబాబును చూసి భరించలేక ఆగ్రహంతో ఆమెను దారుణంగా నరికేశాడు.సూరిబాబుపై కూడా దాడి చేయగా అతడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అప్పారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా ఓ వైపు తల్లి మృతి, మరోవైపు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో వారి ఇద్దరి పిల్లలు అనాధలయ్యారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.