శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (08:20 IST)

కలహాలతో భార్యను నరికి చంపిన భర్త

సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చే కలహాలను సాకుగా తీసుకుని ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యనే తెగనరికేశాడు. తన అహంకారాన్ని ఎదిరిస్తూ వస్తున్న భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆ మృగాడు తన మాట నెగ్గించుకోవాలనుకున్నాడు. చంపుతానంటూ చేసే బెదిరింపులను నిజం చేశాడు. మంగళవారం తెల్లవారు జామున నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి గ్రామంలో ఓ వ్యక్తి భార్యను కత్తితో నరికేశాడు. కూలీ పనులు చేసుకునే వెంకటరమణయ్య (28), మల్లి (26) దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సోమవారం రాత్రి కూడా గొడవ పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున రమణయ్య కత్తితో నరకడంతో మల్లి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.