శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 మే 2016 (11:13 IST)

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో వ్యక్తి దారుణహత్య.. బండరాళ్ళతో తలపై మోది!

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాళ్ళతో తలపై మోది హత్య చేశారు. ఈ మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఎల్బీనగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌ టీమ్‌, జాగిలాల సాయంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
మృతదేహం పక్కన మద్యం సీసాలు లభ్యమయ్యాయి. బండరాళ్లతో తలపై మోది అతడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాతకక్షల కారణంగా హత్య జరిగి ఉండొచ్చన్న కోణంలో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.