శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (10:55 IST)

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకుని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగేశారు..

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటుచేసుకుంది. యాసిడ్ తాగడంతో వారి నోరు, గొంతు భాగాల్లో తీవ్

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటుచేసుకుంది. యాసిడ్ తాగడంతో వారి నోరు, గొంతు భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మోత్కూరు ప్రైవేట్ పాఠశాల స‌మీపంలో కొంద‌రు పారిశుద్ధ్య కార్మికులు ప‌లు యాసిడ్ బాటిళ్లు పెట్టారు.
 
అయితే, దాహంతో ఆ ప్రాంతానికి వెళ్లిన సాగర్ (11), మణి (4) అనే విద్యార్థులు ఆ బాటిళ్ల‌లో నీళ్లున్నాయ‌నుకుని యాసిడ్‌‌ను తాగేశారు. సాగ‌ర్ ఆ స్కూల్లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడ‌ని, మ‌ణి ఇంకా ఆ స్కూల్లో జాయిన్ కాలేద‌ని, అయిన‌ప్ప‌టికీ స్కూల్ వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని అధికారులు చెప్పారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెప్పారు.