గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (12:27 IST)

నా భార్య నగ్న ఫోటోలు నాకే పంపుతున్నాడు.. పనోళ్లకు చూపించిన భర్త

హైదరాబాద్ నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో గత నెల 28వ తేదీన జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన ప్రియురాలి భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసిన ప్రియుడు.. చివరకు ప్రియురాలి భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో హత్య చేసిన వ్యక్తితో పాటు.. మొత్తం ఐదుగురుని పోలీసులు అరెస్టు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉన్న ఓ బహుళ అంతస్తులో శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అనే ఇద్దరు తమతమ భార్యాపిల్లలతో కలిసి జీవిస్తూ వచ్చారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి భార్య అశ్వినితో శ్రీనివాస్ గౌడ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో తన ప్రియుడు శ్రీనివాస్ గౌడ్ సాయంతో కట్టుకున్న భర్త అడ్డు తొలగించుకోవాలని అశ్విని ప్లాన్ చేసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ రెడ్డి చివరకు తన స్నేహితుల సహాయంతో శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేశాడు. ఈ కేసు మిస్టరీగా మారడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించి అసలు నిందితుడు శ్రీధర్ రెడ్డేనని తేల్చారు. దీంతో అతనితో పాటు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. 
 
అయితే, శ్రీనివాస్ రెడ్డి హత్యకు ముందు శ్రీధర్ రెడ్డిని నానా విధాలుగా వేధించాడు. తన ప్రియురాలైన శ్రీధర్ రెడ్డి భార్య అశ్వినితో ముద్దులు పెడుతూ, అసభ్యంగా ఉన్న సమయంలో ఫోటోలు తీసేవాడు. వాటిని శ్రీధర్ రెడ్డికి ఫోనులో పంపేవాడు. వీటిని శ్రీధర్ రెడ్డి తన ఇంట్లో పనిమనుషులకు చూపించి బోరున విలపించేవాడు. ఇలా మానసికంగా వేధించడంతో భరించలేక శ్రీనివాస్ గౌడ్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన శ్రీనివాస్ గౌడ్ తన ప్రియురాలు అశ్విని సహాయంతో శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ చేసి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.