గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (09:30 IST)

భర్తతో విడిపోయింది.. పుట్టింటికి వచ్చేసింది.. పెళ్లి చేసుకుంటానని వేరే వ్యక్తి రేప్ చేశాడు..

భర్తతో విడిపోయింది. పుట్టంటికి వచ్చేసింది.. దీన్ని అదనుగా తీసుకున్న ఓ వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇక ఆమె కూడా అతనిని నమ్మింది. అయితే పెళ్లి పేరిట ఆ దుర్మార్గుడు

భర్తతో విడిపోయింది. పుట్టంటికి వచ్చేసింది.. దీన్ని అదనుగా తీసుకున్న ఓ వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇక ఆమె కూడా అతనిని నమ్మింది. అయితే పెళ్లి పేరిట ఆ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన యువతి (23)కి 2011లో వివాహమైంది. 
 
కుమార్తె పుట్టిన తర్వాత భర్త నుంచి దూరంగా విడిపోయింది. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు అద్దెకు ఉంటున్న యజమాని లాడ్జీతో కలిసి పెళ్లి కోసం ఓ ఫంక్షన్ హాలుకు వెళ్లింది. అక్కడ బంధువైన మహిళ ద్వారా ఇమ్రాన్‌(30) అనే వ్యక్తి పరిచయ మయ్యాడు. ఒకరికొకరు ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్లింది. 
 
పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. దీంతో నమ్మిన యువతి.. ఇమ్రాన్ పిలిచాడని బిర్యానీ షా టేకిడి వద్దకు వెళ్లింది. ఈ నెల 24న బైక్‌పై తీసుకుని నవాబ్‌సాబ్‌కుంటలో ఓ మహిళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ మహిళ వారిద్దరినీ ఇంట్లో ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.