గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (09:21 IST)

రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడు.. పరామర్శిద్దామని వెళ్తూ మృత్యు ఒడిలోకి?

రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడిని పరామర్శించేందుకు బైకుపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ బైకును ఢీకొట్టడం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడిని పరామర్శించేందుకు బైకుపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి సాయికిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. బాపట్ల నరాలశెట్టివారిపాలెంలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతులు నాగమణి ఆమె కూతురు సాయిలక్ష్మి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.