బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (12:55 IST)

పెళ్లై 6 నెలలే అయ్యింది.. బైకుపై ఆఫీసుకెళ్తుండగా.. లారీ ఢీకొంది.. భార్య మృతి.. భర్త?

ఓ ప్రమాదం ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో భార్య తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భర్త గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుం

ఓ ప్రమాదం ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో భార్య తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భర్త గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖకు చెందిన వడ్డాది ఐశ్వర్యకు ఆరునెలల క్రితం కాకినాడకు చెందిన గుండు సుబ్రహ్యణ్యదత్త అవినాష్‌తో వివాహమైంది. ఇద్దరూ ఉద్యోగస్తులు. 
 
ప్రతిరోజూ బైకులో విధులకు వెళ్ళేవారు. నిజాం పేటలో ఉంటున్న వీరిద్దరూ మంగళవారం కూడా ఆఫీసుకు బైకుపై బయల్దేరారు. బాచుపల్లి మీదుగా కొండాపూర్‌కు వెళ్తున్నారు. అయితే జెఎస్ఎన్ నగర్ వద్ద వెనుక నుండి వచ్చిన రెడీమిక్స్ లారీ వారి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య మృతి చెందగా, అవినాష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.