మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (11:14 IST)

కారులో ప్రేమజంట అసభ్యప్రవర్తన, తప్పని చెప్పిన పాపానికి యువకుడు?

హైదరాబాద్ నెక్లస్ రోడ్డు ప్రాంగణం ప్రేమికులకు అడ్డగా మారింది. స్నేహితులు, ప్రేమికులు కాసేపు సరదాగా కూర్చుని మాట్లాడుకుంటే సాధారణ ప్రజలకు ఇబ్బంది ఉండదు కానీ.. కొందరు ప్రేమికులు బరితెగించి ప్రవరిస్తున్న తీరుపై సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తోంది. జలవిహార్ దగ్గర  కారులో ఓ ప్రేమ జంట అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో మందలించిన పాపానికి ఆ యువకుడు ప్రాణాలు మీదకే తెచ్చింది. 
 
రెండు రోజుల క్రితం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగిన దాడి ఘటనలో మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచాడు ఆ యువకుడు. సాయిసాగర్ అనే యువకుడు తన మిత్రుడి బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు నెక్లెస్ రోడ్డుకు వెళ్లాడు. జల విహార్ ప్రాంతంలో కారులో మోబిన్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌తో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. గమనించిన సాయిసాగర్ ఇది పద్దతి కాదంటూ మోబిన్‌ను మందలించాడు. 
 
తన ప్రియురాలి ముందు అవమానం జరిగినట్టు భావించిన మోబిన్ ఆవేశంతో రగిలిపోయాడు. సాయిసాగర్‌తో పాటు అతని మిత్రులపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. విషయం పోలీసులకు చేరి సంఘటనా స్థలానికి చేరుకుని మోబిన్‌ను అదుపులోనికి తీసుకుని సాయిసాగర్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. ఒంటికి బలమైన గాయాలు తగలడంతో మృత్యువుతో పోరాడి సాయిసాగర్ మృతి చెందాడు. 
 
సాయిసాగర్‌కు వివాహమై నెల రోజులు కూడా కాలేదు, ఇంతలోనే సాయిసాగర్ హత్యకు గురవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయిసాగర్‌ను హత్య చేసిన కేసులో నిందితుడైన మోబిన్‌పై మిర్యాలగూడలో 16 కేసులు ఉన్నాయి. పీడీ యాక్టు కేసు కూడా నమోదైంది. ఇటీవలే జైలు నుంచి వచ్చిన మోబిన్ ఈ హత్యకు పాల్పడ్డాడని.. మోబిన్‌ను తమకు అప్పగిస్తే అతనికి శిక్షతామే విధిస్తామని అర్థరాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులు ఆందోళనకు దిగారు.