టీవీ యాంకర్ మోసం కేసు: అరెస్టయ్యాడు కానీ.. పెళ్లిచేసుకోడట!
హైదరాబాద్కు చెందిన ఓ టీవీ యాంకర్ని మోసం చేసిన కేసులో ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తనతో రెండు సంవత్సరాలు సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లంటే ప్రియుడు మల్లిఖార్జున్ ముఖం చాశాడని యాంకర్ అనుశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాపట్నంలో మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన మల్లిఖార్జన్ పట్టుకోవడానికి పోలీసులు వెళ్లగా పరారయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అతడ్ని పట్టుకుని అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు.
అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే పోలీసుస్టేషన్కొచ్చి తనను పెళ్లి చేసుకోవాలని అనుశ్రీ ఎంత ప్రాధేయపడినా నిరాకరించడంతో పోలీసులు మల్లికార్జున్పై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. 2009లో హైదరాబాద్ కు వచ్చిన మల్లిఖార్జున్, అనుశ్రీ బోరబండ జనతానగర్లో కలిసి ఉంటుండగా, తాజాగా అతను వేరే పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో అతడిని అనుశ్రీ పోలీసులకు పట్టించింది.