పవన్ను నేను ప్రశ్నిస్తా...సమాధానం చెప్పకపోతే ఆయన ఇంటి ముందే ధర్నా...వీహెచ్
ప్రభుత్వాలను ప్రశ్నిస్తా... నిలదీస్తానని ఎన్నికల సమయంలో బీరాలు పలికిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ కహానీలు చెబుతున్నాడనీ, రెండు మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన్ను కొన్ని ప్రశ్నలడుగుతానని, తగిన సమాధానం ఇవ్వకుంటే, అక్కడే ఆయన ఇంటి ముందే బైఠాయించి ధర్నా చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు తెలిపారు.
అవినీతిని రూపుమాపుతా, తప్పు చేస్తే నిలదీస్తా అంటూ గత ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రగల్భాలు పలికాడని, ఇప్పుడు కనీసం స్పందించడం లేదని వీహెచ్ ఆరోపించారు. ఎన్నికల ముందు 'జనసేన' పేరిట పార్టీని పెట్టి ఆపై కనిపించకుండా పోయాడని, చంద్రబాబు బండారం రేవంత్ రెడ్డి రూపంలో బయటపడ్డప్పటికీ, ఒక్క ప్రశ్న కూడా ఆయన వేయలేదని ఆరోపించారు. ఎందుకు ప్రగల్బాలు పలికాడో... ఎందుకు ప్రశ్నించడం లేదో ఆయన సమాధానం చెప్పాలని వీహెచ్ ప్రశ్నించారు.