శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:48 IST)

ఆంధ్రా అభివృద్ధికి కేంద్రం సానుకూలం.. సుజనా వెల్లడి..!

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు టీడీపీ పార్టీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఆంధ్రా అభివృద్ధికి కేంద్రం మంగళవారం రూ. 2300 కోట్ల నిధులు విడుదల చేసిన సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్రం నిధుల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 
 
కేంద్రం నిధులపై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫాల్ అప్ చేశారని చెప్పారు. చెప్పినదానికంటే రూ. 240 కోట్లు అదనంగా రాష్ట్రానికి నిధులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇది తన విజయం కాదని, ఎంపీలందరి విజయమని సుజనా చౌదరి తెలిపారు.
 
భారతీయ జనతా పార్టీతో మైత్రి ప్రశాంతంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో సహా నేతలందరూ కూడా  సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.