శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (09:26 IST)

ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడనీ బర్రెల కొట్టం వద్దకు పిలిచి హత్య చేశాడు...

తనతో సంబంధం పెట్టుకున్న యువతితో మరో వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఆ వ్యక్తి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో బర్రెల కొట్టం వద్దకు పిలిచి ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ కేసును పోలీ

తనతో సంబంధం పెట్టుకున్న యువతితో మరో వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఆ వ్యక్తి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో బర్రెల కొట్టం వద్దకు పిలిచి ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ కేసును పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఛేదించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్‌ దుండిగల్‌ గ్రామంలోని బర్రెల కొట్టంలో జక్కుల గోపాల్‌ యాదవ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని గుర్తించి మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమని తేలింది. 
 
గోపాల్‌ యాదవ్‌ ఓ యువతితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు గతంలో మరొక వ్యక్తి (హత్య చేసిన నిందితుడు)తో సన్నిహిత సంబంధం ఉంది. గోపాల్‌ యాదవ్‌తో ఆమె ఉండటం చూసిన ఆ వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు. మంచి పద్ధతి కాదని, ఆమెకు దూరంగా ఉండాలని గోపాల్‌ను అతడు పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతడి తీరు మారలేదు. గోపాల్‌ను హతమార్చాలనుకున్నాడు. 
 
బర్రెల కొట్టం దగ్గరికి వెళ్లే సమయంలో సులువుగా ఖతం చేయవచ్చని భావించాడు. సోమవారం రాత్రి సమీపంలో మద్యం తాగాడు. పథకం ప్రకారం బర్రెల కొట్టం వద్దకు పిలిచి.. రాడ్డుతో తలపై కొట్టాడు. తీవ్రరక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని పేరు, ఇతర వివరాలను మాత్రం బహిర్గతం చేయడం లేదు.