తెలంగాణ రాష్ట్రానికి ఇండియా టుడే బెస్ట్ అచీవ్ మెంట్ అవార్డు!
తెలంగాణ రాష్ట్రాన్ని బెస్ట్ అచీవ్ మెంట్ అవార్డుకు ఇండియా టుడే సంస్థ ఎంపిక చేసింది. మౌలిక వసతుల కల్పనలో దేశంలో అగ్రగామిగా తెలంగాణ ఉందంటూ ఇండియా టుడే తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం చేయూతనిస్తే రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణలో కరెంట్ సమస్యకు చంద్రబాబే కారణమని విమర్శించారు.
విభజన చట్టానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. కరెంట్ విషయంలో టీటీడీపీ నేతలు ముందు చంద్రబాబును నిలదీసి ఆ తర్వాత తమను ప్రశ్నించాలన్నారు.