శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (09:28 IST)

చదువుపై ఇష్టం లేదంటూ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

చదువు కోవడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కడప జిల్లాకు చెందిన శ్రీవిద్య విజయవాడలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలోని ఇంటర్మీడియట్ చదువుకుంటుంది. ఆమె ఇక్కడ శాంతాభవన్ క్యాంపస్‌లో శనివారం వేకువ జామును ఆత్మహత్య చేసుకుంది.
 
సమాచారం అందుకున్న శ్రీ చైతన్య కళాశాలల నిర్వాహకులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు ఆమె మృత దేహాన్ని పరిశీలించగా ఒక లేఖ చిక్కింది. అందులో తనకు చదువుకోవడం ఇష్టం లేదని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించింది.
 
అనంతరం పోలీసులు ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.