మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (18:32 IST)

రోజాను వైసిపి అధ్యక్షురాలిగా చేయండి... సోమిరెడ్డి(వీడియో)

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఒకడుగు ముందుకు వేసి ఎంపిలతో రాజీనామా చేయించడానికి జగన్ సిద్ధమైన నేపధ్యంలో టిడిపి నేతలు ఆ పార్టీలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏక

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఒకడుగు ముందుకు వేసి ఎంపిలతో రాజీనామా చేయించడానికి జగన్ సిద్ధమైన నేపధ్యంలో టిడిపి నేతలు ఆ పార్టీలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏకంగా మంత్రులే రంగంలోకి దిగి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
 
తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి విమర్శలే చేశారు. ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటానికి అనర్హుడన్నారాయన. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే జగన్ పైన 11 కేసులు 13 ఛార్జ్‌షీటులు ఫైల్ చేస్తే తాజాగా 14వ ఛార్జ్ షీట్‌ను కూడా ఫైల్ చేసిందని చెప్పారు. 
 
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లొగొట్టిన జగన్ పార్టీ అధ్యక్షుడి నుంచి తప్పుకుని వెంటనే ఆ బాధ్యతను రోజాకు గాని, అంబటి రాంబాబుకు గాని అప్పజెప్పాలన్నారు. ఆంధ్రకు రావాల్సిన వాటిపై కేంద్ర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలా ఢిల్లీలో ఒక మాట, బయటకొచ్చి మరోమాట మాట్లాడి ప్రజలను మోసం చేయడం తెలుగుదేశం పార్టీకి తెలియదన్నారు. చూడండి ఆయన మాటల్లోనే వీడియో...