మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 28 సెప్టెంబరు 2016 (15:48 IST)

టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల ఆఫీసుపై ఐటీ దాడులు... కోట్లలో డబ్బు ఉందా...?

గుంటూరు : కేంద్రం త‌న‌దైన శైలిలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా దేశంలోని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల ఇళ్ల‌పై ఐటీ దాడులు జ‌ర‌ుగుతున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆఫీసుపై ఐటీ శాఖ దాడులు

గుంటూరు : కేంద్రం త‌న‌దైన శైలిలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా దేశంలోని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల ఇళ్ల‌పై ఐటీ దాడులు జ‌ర‌ుగుతున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆఫీసుపై ఐటీ శాఖ దాడులు చేసింది. అనంతరం బెంగళూరులోని మోదుగుల నివాసంలో కూడా దాడులు నిర్వహిస్తోంది. వ్యాపారవేత్త అయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలో టీడీపీ ఎంపీగా పనిచేసి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన ఆఫీసు, నివాసంపై ఐటీ దాడులు చేయడం రాజకీయ వర్గాలలో కలకలం రేగుతోంది.
 
టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఇంట్లో సోదాలు, బెంగళూరులోని ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న అధికారులు అంతా సెంట్ర‌ల్ క‌మాండ్‌తోనే ముందుకు వెళుతున్నారు. ఎమ్మెల్యే వ్యాపార లావాదేవీల రికార్డుల్ని 5 బృందాలు పరిశీలిస్తున్నాయి. బెంగళూరులోని కొన్ని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ చేశార‌ని స‌మాచారం. రేపు గుంటూరు, హైదరాబాద్‌ ఆఫీసుల్లోనూ సోదాలు చేసేందుకు ఐటీ రంగం సిద్ధంమైంది. కోట్లలో అక్రమంగా డబ్బు ఉన్నట్లు ఐటీ అధికారులకు అనుమానం. రాంకీ సంస్థలలో కూడా సోదాలు జరిగే అవకాశం ఉందని సమాచారం.