మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (20:02 IST)

మాన‌వ మ‌నుగడ‌కు ఇదో మంచి కార్య‌క్ర‌మం.. అగ్నివేశ్‌

తిరుప‌తిలో విశ్వ‌ధ‌ర్మ పీఠం ప్రారంభించిన నిర్వ‌హిస్తున్న ఈ స‌ద‌స్సు మాన‌వ‌మ‌నుగ‌డుకు, ప్రపంచ శాంతికి ఓ మంచి కార్యక్ర‌మ‌మ‌ని ఆర్య‌స‌మాజ ప్ర‌పంచ ప్రెసిడెంట్ స్వామి అగ్నివేశ్ తెలిపారు. తిరుప‌తి గ్రాండ్ రిడ్జిలో ఏర్పాటు చేసిన స‌దస్సుకు ఆయ‌న ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ, స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రు శాంతి కోసం కృషి చేయాల‌ని కోరారు.

దేశం శాంతియుతంగా ఉంటే ప‌లురంగాల‌లో అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు. మంత్రి బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్ర‌పంచ శాంతి కోసం ప్ర‌తి ఒక్క‌రూ పాటు ప‌డ‌లాని కోరారు. ఇటీవ‌ల పాకిస్తాన్ లో జ‌రిగిన సంఘ‌ట‌న క‌ల‌చి వేచింద‌న్నారు. చిన్న‌పిల్ల‌ల‌ను చంపేయ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ శాంతి కోసం జ‌రుగుతున్న స‌దస్సులోని తీర్మానాల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ళ‌తామ‌ని అన్నారు.

ఇలాంటి స‌ద‌స్సు ఇక్క‌డ తిరుప‌తిలో వేంక‌టేశ్వ‌ర స్వామి పాద‌ప‌ద్మాల ద‌గ్గ‌ర జ‌ర‌గ‌డం శుభ‌సూచ‌క‌మ‌న్నారు. మంత్రి మాణిక్యాల రావు జ్యోతి వెలిగించి స‌ద‌స్సును ప్రారంభించారు.