గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:13 IST)

జగన్ ఏ ఎండకాగొడుగు పడుతున్నాడు : చంద్రబాబు పరోక్ష ఆరోపణ

కొందరు నాయకుల్లా తాను కమీషన్ల కోసం సాగునీటి పనులు చేపట్టలేదనీ, తాను కడపలాంటి వెనుకబడిన ప్రాంతానికి సాగునీరు తీసుకురావడమే ధ్యేయంగా పని చేస్తున్నానని ఆయన అన్నారు. శుక్రవారం కడప గండికోటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కొందరు నాయకులు తమ పత్రికలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొ విధంగా వార్తలు రాయిస్తున్నారని చెప్పారు. కడపలాంటి జిల్లాలకు నీళ్ళు తెప్పించే ప్రయత్నం చేస్తుంటే, అక్కడ జనాన్ని రెచ్చగొట్టే విధంగా కథనాలు రాయిస్తూ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని జగన్ ను ఉద్ద్యేశించే వ్యాఖ్యానించారు.
 
ఇక్కడికి నీళ్లు ఎలా తెస్తున్నారని ప్రశ్నిస్తున్నారనీ, అలాగే అక్కడి జనాన్ని మరిచిపోతున్నారని పత్రికలలో వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీకి నీరాజనం పట్టిన తూర్పుగోదావరి జిల్లాను మరిచే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. అలాగే కడపలాంటి జిల్లాలకు నీరు తెప్పించి చూపిస్తామని అన్నారు. ఆ నాయకులు కేవలం కమీషన్ల కోసం ఇరిగేషన్ పనులు చేపట్టారనీ, తాము అలా కాదనీ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరు పథకాలపై జగన్ ను పరోక్షంగా విమర్శించారు.