శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (10:33 IST)

నరేంద్ర మోడీ గాలితో చంద్రబాబు గెలిచారు : జగన్ మోహన్ రెడ్డి

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీ అనుకూల పవనాల వల్లే ఏపీలో చంద్రబాబు నాయుడు గెలుపొందారని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఉదయం మాట్లాడుతూ... కడక ఎంపీగా పోటీ చేసిన సందర్భంగా తనకు వచ్చిన మెజారిటీ 5 లక్షలని గుర్తు చేశారు. ఈ మెజార్టీనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిదంన్నారు. 
 
ఆ అతి స్వల్ప మెజారిటీతోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే, తానే అధికారంలోకి వచ్చేవాడినని కూడా జగన్ వ్యాఖ్యానించారు. కాని తాను అబద్ధాలు చెప్పలేనని, చంద్రబాబులా ప్రజలను మోసం చేయలేనన్నారు. రైతు రుణమాఫీ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానం రైతులకు ఆగ్రహం తెప్పించక మానదన్నారు.