గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 22 ఆగస్టు 2016 (16:16 IST)

సాగ‌ర్ బ‌స్సు ప్రమాదం... బాధితులకు జగన్ పరామర్శ

హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న యాత్రాజ‌ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద కాలువలో పడింది. 31 మంది ప్రయాణీకులతో వెళుతున్న బస్సు సాగర్ ఎడమ కాలువ ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ పైనుంచి కాలువలో పడింది.స్థానిక మత్స్య కారులు బస్సులోనుంచి

హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న యాత్రాజ‌ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద కాలువలో పడింది. 31 మంది ప్రయాణీకులతో వెళుతున్న బస్సు సాగర్ ఎడమ కాలువ ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ పైనుంచి కాలువలో పడింది.స్థానిక మత్స్య కారులు బస్సులోనుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి మూడు అంబులెన్సులలో తరలించారు. ప్రమాదానికి కారకుడైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
 
జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌... చంద్ర‌బాబు ఎక్స్ గ్రేషియా                         
బ‌స్సు కాలువలో పడిన సంఘటన స్థలానికి వై.యస్.జగన్ విచ్చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. మ‌రోప‌క్క చంద్ర‌బాబు నాయుడు మృతుల కుటుంబాల‌కు 3 ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌రిహారం ప్ర‌క‌టించారు. మృత దేహాలను స్వస్థలాలకు చేర్చేంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విపత్తుల నివారణ అధికారులను హోం మంత్రి చినరాజప్ప కోరారు.