శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (09:13 IST)

శ్రీవారిని దర్శించుకున్నాకే జగన్ పాదయాత్ర.. ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇడుపాయలో మొదలై ఇచ్చాపురంలో ముగియనుందని వైసీపీ శ్రేణులు స్పష్టత నిచ్చాయి. కడప జిల్లాలో ఇడుప

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇడుపాయలో మొదలై ఇచ్చాపురంలో ముగియనుందని వైసీపీ శ్రేణులు స్పష్టత నిచ్చాయి. కడప జిల్లాలో ఇడుపులపాయతో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తన పాదయాత్రను ముగించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. 
 
ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. ఇప్పటికే పాదయాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి అక్టోబరులోనే ఆయన పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా వేశారు. నవంబరు 2న జగన్ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానుంది.
 
పాదయాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుంటారు. అనంతరం ఇడుపులపాయ చేరుకుని పాదయాత్రకు శ్రీకారం చుడతారు. తొలుత కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర చేస్తారు. అనంతరం ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా సాగి ఇచ్చాపురంలో ముగుస్తుందని వైకాపా వర్గాలు తెలిపాయి.