మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (15:06 IST)

ఆంధ్రులను బూతులు తిడుతూ పబ్బంగడుపుతున్న తెరాస నేతలు : జగ్గారెడ్డి

తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలను బూతులు తిడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పబ్బం గడుపుకుంటున్నారని మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల పరిశ్రమలో భాగంగా ఆయన సోమవారం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలు ఆంధ్రావారిని తిట్టి పబ్బం గడుకుపుకుంటున్నారని విమర్శించారు. ప్రజలను టీఆర్ఎస్ సర్కారు అవాస్తవాలతో మభ్యపెడుతోందని మండిపడ్డారు. 
 
అభివృద్ధిని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఇక, హరీశ్ రావుకు తన పేరు జపించందే ఒక్క రోజు కూడా నిద్రపట్టదని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ కోసం బీజేపీ తీర్మానం చేసిన నాటికి హరీశ్ చిన్నపిల్లవాడని గుర్తు చేశాడు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పురుడు పోసుకున్న వెంటనే తెలంగాణ ఉద్యమంలోకి దూకినట్టుగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మాటలు ఉన్నాయని చెప్పారు.