మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (15:08 IST)

జగ్గారెడ్డి కోర్టులో లొంగిపోయారట.. 2011-12లో ఏం జరిగింది?

మెదక్ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక కోర్టులో లొంగిపోయారు. 2011-12లో సదాశివపేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో నర్సింహులు అనే వ్యక్తి రేషన్ బియ్యం బాగోలేవని ఆరోపించడంతో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి అతనిపై చేజేసుకోవడం వివాదాస్పదమైంది. 
 
ఆ తరువాత జేఏసీ నేతలు జగ్గారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు వారిపై కూడా జగ్గారెడ్డి చేయిచేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో జగ్గారెడ్డిపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఈ రెండు కేసుల్లో జగ్గారెడ్డి కోర్టులో లొంగిపోయినట్టు సంగారెడ్డి డీఎస్పీ తెలిపారు.