గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 4 జులై 2017 (10:40 IST)

ఆసక్తికరం... పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసే సబ్జెక్ట్... విజయేంద్రప్రసాద్ స్టోరీ కేక...

కొన్ని సినిమాల ప్రభావం ప్రజలపై మామూలుగా వుండదు. ఇప్పటికే ఎన్టీఆర్, ఎంజీఆర్ , జయలలిత వంటివారు తమతమ సందేశాత్మక చిత్రాలతో రాజకీయాల్లోకి ప్రవేశించి ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల స్థాయిలోనే ఆగిపోయారు. ముఖ్యమ

కొన్ని సినిమాల ప్రభావం ప్రజలపై మామూలుగా వుండదు. ఇప్పటికే ఎన్టీఆర్, ఎంజీఆర్ , జయలలిత వంటివారు తమతమ సందేశాత్మక చిత్రాలతో రాజకీయాల్లోకి ప్రవేశించి ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల స్థాయిలోనే ఆగిపోయారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే వరకూ రాలేకపోయారు. దీనికి కారణం వారి వ్యక్తిత్వంతో పాటు రాజకీయ నేర్పు కూడా అవసరం. 
 
ఇదిలావుంటే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ముఖ్య సభ్యులు కసరత్తు చేస్తున్నారు. 2018 మార్చి నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సినిమాలు వదిలేసి రాజకీయాలకు అంకితమవుతారట. ఈ నేపధ్యంలో 2018 ఫిబ్రవరిలో ఆయన హీరోగా బలమైన సందేశాత్మక చిత్రం తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. 
 
ఇప్పటికీ ఈ సబ్జెక్టుపై రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కసరత్తు చేస్తున్నారట. దాదాపు స్క్రిప్టు పూర్తయిందనీ, తుది మెరుగులు దిద్దుతున్నారని ఫిలిమ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఆ సబ్జెక్టును తెరపైకి ఎక్కించి, అందులో పవన్ కళ్యాణ్ నటిస్తే ఇక ఆంధ్రలో కేక పుట్టిస్తుందంటున్నారు. 
 
మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఈ స్టోరీ వుంటుందనీ, అందువల్ల ఆ చిత్రంతో పవన్ సినీ ప్రపంచం నుంచి రాజకీయ ప్రపంచంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశిస్తారని అంటున్నారు. ఇటు తెదేపా, అటు వైకాపాలను కిందకి తోసి పవన్ కల్యాణ్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో వేచి చూడాల్సిందే.