శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:13 IST)

చంద్రబాబులో "కమ్మ"వాసన కాస్త ఎక్కువే : జేసీ దివాకర్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడులో కమ్మ ఫీలింగ్ కాస్త ఎక్కువగానే ఉందని, అయినా అందరినీ సమానంగా చూసే వ్యక్తని ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబులో కమ్మ కులపు వారిపై కొంత ప్రేమ ఉన్నా, అందరినీ సమానంగా చూసే వ్యక్తేనని, కాస్తంత మంచితనం కూడా ఉందన్నారు. చంద్రబాబు వైఖరి సరైనదేనని, అలాగే ఉండాలని అభిప్రాయపడ్డారు. 
 
అంతేకాకుండా, "మీరెన్నైనా చెప్పండి... కమ్మోడు... కమ్మ నా... కొడుకు ఇవన్నీ ఉన్నాయి. నీళ్ల విషయంలో ఆయనకు కమ్మ లేదు కాపు లేదు. కష్టపడి పని చేస్తాడు. వాడు గనుక నీళ్లు తేకుంటే నేను ఎన్నడో గుడ్ బై చెప్పేసేవాడిని. పోయిన ఎలక్షన్స్ లో ఒక్క పైసా ఇవ్వలా. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఆ నా... ఒక్కపైనా ఇవ్వలా. నేనే... చెబితే ఎవరూ నమ్మరు. నేనే ఖర్చు పెట్టా. ఇంతకుముందు పెట్టా. ఇప్పుడూ పెట్టా" అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.