గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (16:04 IST)

జేసీ ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళలేదు.. దక్షిణాఫ్రికా వెళ్ళారు: దివాకర్ రెడ్డి

గన్‌మెన్ల వ్యవహారంలో అలిగి తన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడన్న ప్రచారం పత్రికలు, ఛానళ్ల సృష్టి అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దక్షిణాఫ్రికాకు వెళ్లారని జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. గన్‌మెన్ల వ్యవహారాన్ని సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తన దృష్టికి తీసుకురాలేదన్నారు. దాని గురించి అంతగా ప్రాధాన్యత ఇచ్చి తాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. 
 
గతంలో నిర్ణయించిన తేదీలో దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. గన్‌మెన్ల వ్యవహారంలో మొదట దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. తుని సంఘటనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హోంమంత్రి చినరాజప్ప బిజీగా ఉన్నారు. ఇప్పట్లో వీరు ప్రశాంతంగా కూర్చొని గన్‌మెన్ల వ్యవహారం చక్కదిద్దే అవకాశం లేదు కాబట్టి దక్షిణాఫ్రికాకు వెళ్ళిపోయారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.