మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (16:48 IST)

నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అమ్మేసేలా ఉన్నారు: జీవన్‌రెడ్డి

తెలంగాణా సీఎం కేసీఆర్ మరో నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అమ్మేసేలా ఉన్నారని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. వాస్తుదోషం ఉందన్న పేరుతో నగర నడిబోద్దులోని సచివాలయాన్ని తనవారికి బేరం పెట్టాలని ఆయన చూస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు. 
 
కేసీఆర్ వ్యక్తిగత ఆలోచనలు పక్కనపెట్టి ప్రజల మేలు కోసం ఆలోచించాలని జీవన్ రెడ్డి సూచించారు. రాచరికం, రాజ్యాలు, రాజుల పాలన ఎప్పుడో పోయిందని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు.